Monday, 6 April 2020

Friday, 27 March 2020

Allu Arjun War Declaration for Corona virus News updates & Allu Arjun Corona Masks Use photos Pichers imeges






కరోనా లాక్‌డౌన్‌: అల్లు అర్జున్‌ ఫోటో వైరల్‌

27 Mar, 2020 


సాక్షి, హైదరాబాద్‌ : కరోనా దెబ్బకు సెలబ్రిటీలు సైతం సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సెలబ్రెటీల నుంచి సాధారణ ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబం కోసం కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లవ్స్‌ ధరించి సూపర్‌ మార్కెట్‌లో తనకు కావాల్సిన వస్తువులును కొనుక్కుని సాదాసీదాగా వెళ్లిపోయాడు. అయితే బన్ని సూపర్‌ మార్కెట్‌లో సాధారణ వ్యక్తిగా వస్తువులు కొంటున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంత. 1.25 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కలిపి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతేకాకుండా మన రోజువారి జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, మిలటరీ, పోలీసులు, ఇలా మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. వారి స్ఫూర్తితో నా వంతుగా చిన్నపాటి సాయం చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. చేతులను తరుచు కడుక్కోవడం, స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. అతి త్వరలోనే కరోనా అంతమవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ సందర్భంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో ఈ సమయాన్ని పూర్తిగా కుటుంబంతోనే గడుపుతున్నారు అల్లు అర్జున్‌. తన పిల్లలు అయాన్‌, అర్హలతో సరదాగా ఆడుకుంటూ లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

Ramcharan 2020 Birthday updates News reports & Ramcharan Upasana latest Birthday Updates Pichers imeges wallpapers Download



చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..




ఈ రోజు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే తన బర్త్‌డే వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నాడు చెర్రీ.  సెల్ఫ్‌ ఐసోలేషన్‌ కారణంగా ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని.. అభిమానులు, సన్నిహితులు అదే తనకు ఇచ్చే గొప్ప బహుమతని చరణ్‌ పేర్కొన్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులెవరూ కూడా స్వయంగా చరణ్‌ ఇంటికి వెళ్లి విష్‌ చేయలేదు. టాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సోషల్‌ మీడియా వేదికగానే చెర్రీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా, తన భర్త చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఉపాసన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. 

Thursday, 26 March 2020

Hero Ramcharan Big found for Corona virus Telugu news updates




 హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ ముందుకొచ్చారు. ఈ సంక్షోభ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో రూ. 70 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చెప్పారు. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు చేస్తున్న కృషి అభినందనీయమైనదన్నారు. కరోనా నివారణను వారు తీసుకుంటున్న చర్యలకు ఒక బాధ్యత గత పౌరునిగా మద్దతు తెలుపడమే కాకుండా వాటిని పాటిస్తానని చెప్పారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమై.. సురక్షితంగా ఉంగాలని ఆకాంక్షించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో రామ్‌చరణ్‌ తన వంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 649, తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్‌లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌..
ఇప్పటికే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్‌లు కలిగిన రామ్‌చరణ్‌.. గురువారం ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్‌ ఖాతాను ప్రారంభించన రామ్‌చరణ్‌.. తొలి ట్విట్‌లోనే కరోనాపై పోరాటానికి విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ట్విటర్‌ ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు పలువురు సెలబ్రిటీలు విషెస్‌ చెబుతూ ట్వీట్‌లు చేస్తున్నారు.

Stars fight Corona virus Telugu breaking News updates

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం




కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల భారతదేశంలో ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది.  కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రూ. రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు చెరో  కోటి రూపాయలు  విరాళంగా అందజేశారు.  రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తాజాగా కరోనా కట్టడికి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభస్‌కూడా తన వంతు సాయం అందించాడు.  కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా  కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌, తెలంగాణ రిలీఫ్‌ ఫండ్‌కి అందజేస్తున్నట్లు  ప్రభాస్‌ ప్రకటించారు.
(చదవండి : కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం)
యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75 ల‌క్ష‌ల విరాళం
క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు.
Prabhas

 

Copyright @ 2013 Telugu Breaking News updates & Telugu Movies Breaking News & Telugu .